జనాజ. మృత దేహానికి స్నానం చేయించటం, ఖననం చేయటం యొక్క ప్రాముఖ్యతలు
మృతుని స్నానం చేయించుట.
- మగవారు మగవారికి, స్త్రీలు స్త్రీలకి స్నానం చేయించవలెను.
- భార్య భర్తకి, భర్త భార్యకి స్నానం చేయించ వచ్చును.
- మృతుని యొక్క మర్మంగాలపై వస్త్రం కప్పి, మిగతా వస్త్రాలు శరీరం నుండి వేరు చేయవలెను.
- మీసాలు,గోళ్ళు, చెంక వెంట్రుకలు అతి పెద్దగా ఉంటే స్నానానికి ముందు కత్తిరించవలెను.
- వీపును కాస్త పైకి లేపి విసర్జన బయటకు వచ్చునట్లుగా కడుపును నొక్కవలెను. ఆతర్వాత బాగా కడుగవలెను. శుభ్రపరుస్తున్నప్పుడు ఎక్కువ నీళ్ళు వాడవలెను.
- చేతికి తొడుగుళ్ళు తొడిగి విసర్జన కడుగవలెను.
- బాగా శుభ్రపరచిన తర్వాత వుదూ చేయించవలెను.
- ముందు కుడి ప్రక్కకు, ఆ తర్వాత ఎడమ ప్రక్కకు స్నానం చేయించవలెను.
- ఆతర్వాత రేగుచెట్టు ఆకుతో లేదా సబ్బుతో స్నానం చేయించవలెను. స్నానం ఒకసారి చేయించడం తప్పని సరి. 3 సార్లు చేయించడం సున్నహ్.
- ఇక చివరన కాపూర్ (కర్పూరం) నీళ్ళతో లేదా సువాసన ద్రవ్యాలు కలిపిన నీళ్ళతో స్నానం చేయించవలెను.
- తప్పని సరిగా స్త్రీల వెంట్రుకలను మూడు జడలు చేయవలెను.
కఫన్ తొడిగించుట
- మగవారికి 3 బట్టలలో కఫన్ ఇవ్వవలెను.
- కఫన్ శుభ్రముగా, తెల్లగా, సువాసన పూసినదై ఉండాలి.
- ఆడవారికి 5 బట్టలలో కఫన్ ఇవ్వవలెను.
- ఒక బట్టను నడుం క్రింద, ఒకటి భుజాల క్రింద, ఒకటి దుపట్టా మరియు రెండు పొడుగాటి బట్టలు ఉండాలి
కఫన్ పద్ధతి
- ముందుగా మూడు గట్టిగా ఉండే వస్త్రపు పట్టీలు పరచవలెను.
- మూడు పట్టీలపై మగవారి కోసం ఒకే సైజులోని 3 కఫన్ వస్త్రములు, స్త్రీల కోసమైతే 2 కఫన్ వస్త్రములు పరచవలెను.
- స్త్రీల కోసం కఫన్ వస్త్రంపై తల బయటికి తీయటానికి వీలుగా కత్తిరించఉన్న ఇంకో చిన్న వస్త్రం పరచవలెను.
- స్త్రీల కోసం ఇంకో చిన్న వస్త్రము (నడుము నుండి కాళ్ళ వరకు సరిపోయేటట్లు) పరచవలెను.
- స్త్రీల కోసం ఇంకో చిన్న వస్త్రము తల కప్పేటట్లుగా పరచవలెను.
- చివరగా గుసుల్ చేయబడిన మృతదేహమును పైన పరచబడిన వస్త్రములపై పడుకోబెట్టి ఒక్కో వస్త్రమును చుట్టవలెను. ఆఖరుగా మొట్టమొదట పరచిన మూడు పట్టీలతో కఫన్ ను కట్టవలెను.
Read (చదవండి): జనాజ నమాజు చేయు విధానము
ఖననం చేయుట
- సమాధిలోతుగా మరియు అవసరమైనంత వెడల్పుగా ఉండాలి.
- సమాధి లహద్ లో త్రవ్వుట ఉత్తమం అంటే మృతదేహాన్ని లోపల దాచి పెట్టేంత లేదా అడుగు పెట్టె మాదిరిగా చొరియ ఖిబ్లావైపుకు త్రవ్వవలెను.
- సమాధిలో మృతదేహమును కాస్త కుడివైపు త్రిప్పి, ముఖం ఖిబ్లావైపు ఉండేటట్లు చేయవలెను.
- లహద్ (చొరియ)ని కాల్చని ఇటుకలు మరియు తడిచిన మట్టి గారతో పూడ్చి (సీలు చేసి) ఆ తర్వాత సమాధిని మట్టితో నింపవలెను.
- సమాధిని భూమినుండి ఒక జాన అంతట పైకి ఉండునట్లు మట్టికప్పి నీళ్ళు చల్లవలెను.
Source: ఫిఖ్ హ్ – రెండవ స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : – షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా